క‌రోనా ఉధృతిః ఏపీలో కొత్తగా మరో 35 పాజిటివ్ కేసులు

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఈ రోజు విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ మేర‌కు రాష్ట్రంలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి...

క‌రోనా ఉధృతిః ఏపీలో కొత్తగా మరో 35 పాజిటివ్ కేసులు

Updated on: Apr 21, 2020 | 1:00 PM

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఈ రోజు విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ మేర‌కు రాష్ట్రంలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి వెల్ల‌డించారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 10,  కడప జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. అలాగే ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్‌ కాగా, 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 639 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.