భారత్లో కరోనా విజృంభణ ఆగడం లేదు. కాస్త తగ్గుతున్నట్లుగానే అనిపిస్తోన్నకేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46వేల మార్క్ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదు కాగా.. 195 మంది మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 46,433గా ఉంది. 1,568 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 12727 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 32,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే లాక్డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగించిన కేంద్రం.. కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
Read This Story Also: Breaking: ఏపీలో మళ్లీ పెరగనున్న మద్యం ధరలు.. ఈ సారి ఏకంగా 50 శాతం..!