మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

మరో 30 రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. ఈ సందర్భంగా ఆయన వైరస్‌కి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ఆయన మాట్లాడుతూ.. ఐదు నుంచి పది రెట్లు పాజిటివ్ కేసులు పెరిగే...

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

Updated on: May 25, 2020 | 7:23 PM

మరో 30 రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. ఈ సందర్భంగా ఆయన వైరస్‌కి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఐదు నుంచి పది రెట్లు పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదముందన్నారు. ఎండాకాలం ఉష్ణోగ్రతలు పెరిగినంత మాత్రాన వైరస్ వ్యాప్తి ఆగదన్నారు. ప్రకటిస్తున్న వాక్సిన్‌లు అన్నీ ఇంకా క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉన్నాయి. వ్యాక్సిన్ రావడానికి కనీసం ఆరు నెలలకు పైగా సమయం ఖచ్చితంగా పడుతుందన్నారు.

కరోనా వైరస్ మ్యుటేషన్ నేపథ్యంలో వాక్సిన్ పనితీరుపై కూడా ప్రభావం ఉంటుంది. వ్యాక్సిన్ ప్రభావం కొన్నింటి మీద పని చేసినా.. మరికొన్నింటి మీద పని చేయకపోవచ్చు. వాక్సిన్ గురించి ఆలోచించే కన్నా మన జాగ్రత్తలే మనకు తక్షణ మార్గమన్నారు. ప్రాంతాల బట్టి కరోనా రూపాంతరం చెందుతోంది. అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్‌లో మార్పులను గమనిస్తున్నాం. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీతో సహా పలు ప్రదేశాల్లో అసాధారణ కరోనాను గమనిస్తున్నాం. తెలంగాణలో కనిపిస్తున్న వైరస్.. మిగిలిన ప్రాంతాల వైరస్‌లకు భిన్నంగా ఉంది. ఈ కరోనా వైరస్‌పై మరిన్ని లోతైన పరిశోధనలు సాగుతున్నాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.

Read More: 

వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..

Loading...
Unable to load recommendations.
Follow Us