తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఏపీలో శనివారం కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1525కి చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 33 మంది మరణించారు. ఇక 441 మంది డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం 1,051 మంది చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్న వారి వివరాలతో జాబితా విడుదల చేసింది రాష్ట్ర ఆరోగ్య శాఖ.
గత 24 గంటల్లో కర్నూలులో 25, కృష్ణ జిల్లాలో 12, గుంటూరు 2 , అనంతలో 4, కడప 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, నెల్లూరు 6, ప్రకాశంలో 1, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసుల గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఇక జిల్లాల వారిగా తీసుకుంటే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 436 కేసులు, గుంటూరు 306, కృష్ణా జిల్లాలో 258 కేసులు నమోదు నమోదయ్యాయి. అనంతలో 71, చిత్తూరు లో 80. తూర్పు గోదావరిలో 45,కడపలో 83, నెల్లూరు లో 90, ప్రకాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖ 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 59 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.
ఇక తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకోగా.. సడన్గా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ వరుసగా మూడు, నాలుగు రోజులు సింగిల్ డిజిట్ కేసులు నమోదవ్వగా.. అకస్మాత్తుగా డబుల్ డిజిట్కు చేరుకుంటున్నాయి. తాజాగా శనివారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ కోవిడ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. ఇక శనివారం కరోనాతో ఒకరు మృతి చెందగా, 35 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ 499 మంది డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో 533 మంది చికిత్స తీసుకుంటున్నారు.
Read More:
గుడ్న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం: డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్..
బాలీవుడ్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!