లాక్ డౌన్ పై ఏం చేద్దాం? పొడిగించే యోచనలో కేంద్రం !

| Edited By: Pardhasaradhi Peri

Apr 07, 2020 | 5:00 PM

ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా సర్కార్ యోచిస్తోందని వెల్లడించాయి. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజలు సుదీర్ఘ పోరాటానికి సిధ్ధంగా ఉండాలని ప్రధాని మోదీ

లాక్ డౌన్ పై ఏం చేద్దాం? పొడిగించే యోచనలో కేంద్రం !
Follow us on

ఏప్రిల్ 14 తరువాత కూడా లాక్ డౌన్ పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా సర్కార్ యోచిస్తోందని వెల్లడించాయి. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజలు సుదీర్ఘ పోరాటానికి సిధ్ధంగా ఉండాలని ప్రధాని మోదీ కోరిన విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేశాయి. లాక్ డౌన్ పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరగా.. దీన్ని దశలవారీగా ఎత్తి వేయాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభ్యర్థించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారి ఒకరు.. లాక్ డౌన్ పొడిగించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆంక్లలు ఎత్తివేశాక ఏ ఒక్క కరోనా కేసు బయటపడినా పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందన్నారు. అయితే ఇంకా వివిధ రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం తెలుసుకుంటోంది. వచ్ఛే వారం అతి కీలకమైనదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసిన అంశం.