పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం కరోనా వైరస్ లాక్ డౌన్ ని జులై 31 వరకు పొడిగించింది. ప్రస్తుత లాక్ డౌన్ కాల పరిమితి ఈ నెల 30 తో ముగియనుండగా దీదీ సర్కార్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లాక్ డౌన్ ని పొడిగించిన నేపథ్యంలో రైలు, మెట్రో సర్వీసులు కూడా నడవవని, అలాగే స్కూళ్ళు, కాలేజీలు కూడా జులై 31 వరకు మూసి ఉంటాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. బెంగాల్ లో 14,728 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 580 మంది కరోనా రోగులు మృతి చెందారు.కాగా.. మమత ప్రభుత్వం తీసుకున్న హఠాత్ నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.