AP Corona Cases: ఏపీలో కరోనా స్వింగ్.. కొత్తగా 253 మందికి పాజిటివ్.. జిల్లాల వారీగా కేసుల వివరాలు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 30,716 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 253 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522కి చేరింది.

AP Corona Cases: ఏపీలో కరోనా స్వింగ్.. కొత్తగా 253 మందికి పాజిటివ్.. జిల్లాల వారీగా కేసుల వివరాలు
Coronavirus Cases In AP

Updated on: Mar 17, 2021 | 6:50 PM

Andhra Corona Cases: ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 30,716 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 253 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,522కి చేరింది. కొత్తగా గుంటూరు ఒకరు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7186కు చేరింది. గడిచిన 24 గంటల్లో 137 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 883642కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1694 యాక్టీవ్ కేసులున్నాయి. కాగా ఇప్పటివరకు ఏపీలో 1,46,11,499 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.

భారత్‌లో కరోనా వైరస్‌ మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా దేశవ్యాప్తంగా 28,903 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 28వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,38,734కు చేరింది. ఇందులో 2,34,406 యాక్టివ్ కేసులు ఉండగా, 1,10,457,284 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 188 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,59,044కు చేరుకుంది.

కాగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. ఎప్పుటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలని, ఒంట్లో ఏమాత్రం నలతగా అనిపించినా కరోనా టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:

TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 20న నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ విడుదల

Tenali Corona Cases: గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. తెనాలిలో ఒక్క రోజే ప్రమాదకరంగా నమోదైన కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us