ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు కోటికి దగ్గరలోకి కోవిడ్ కేసులు చేరుకుంటున్నాయి. దీంతో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రపంచం అంతటా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. ఇటీవల నా ఫ్రెండ్ శిల్పారెడ్డి, ఆమె భర్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ సమయంలో వాళ్లేం చేశారో శిల్పారెడ్డి వివరంగా చెప్పారు. విన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా’.
శిల్పారెడ్డి ఇన్స్టా వీడియో కీ పాయింట్స్:
* ఆ మధ్య మా ఇంటికి వచ్చిన ఓ ఫ్రెండ్ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ అని తేలింది.
* అందుకే నేను, మా వారూ టెస్ట్ చేయించుకున్నాం.
* మాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. అయినా పాజిటివ్ అని తేలింది.
* ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా ఉండాలి
* ప్రతి నిత్యం యోగా, క్రియ, ధ్యానం చేయాలి.
* కోవిడ్ ని చూసి భయపడాల్సిన పనిలేదు. ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని ఆమె చేసిన ఇన్స్టా వీడియోను ఫ్యాన్స్తో పంచుకున్నారు అక్కినేని నాగార్జున.
As the cases of #COVID__19 increase in the world,The only weapon right now seems to be being healthy in mind & body.Our dear friend #Shilpareddy and her husband experienced the virus and came out of it shining!!?? Listen to her experience..inspiring!!? https://t.co/mqRmuLQYlM
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 25, 2020