డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐసీయూ తాళాలు దొరక్క వృద్ధురాలు మృతి..
Coronavirus Outbreak: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఐసీయూ తాళం కనిపించకపోవడం వల్ల ఓ వృద్ద మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయినికు చెందిన 55 ఏళ్ల మహిళ బ్లడ్ ప్రజర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో జిల్లా ఆసుపత్రిలో గురువారం రాత్రి అడ్మిట్ అయింది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అక్కడి డాక్టర్లు ఆమెకు కరోనా టెస్టులు చేసి మాధవ్నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె రక్త […]
Coronavirus Outbreak: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఐసీయూ తాళం కనిపించకపోవడం వల్ల ఓ వృద్ద మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయినికు చెందిన 55 ఏళ్ల మహిళ బ్లడ్ ప్రజర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో జిల్లా ఆసుపత్రిలో గురువారం రాత్రి అడ్మిట్ అయింది.
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అక్కడి డాక్టర్లు ఆమెకు కరోనా టెస్టులు చేసి మాధవ్నగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె రక్త నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. అయితే అక్కడ కరోనా పేషంట్లు ఎక్కువగా ఉండటం అంతేకాక సరైన సదుపాయాలు లేకపోవడంతో డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను ఆర్డీ గార్దీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
సదరు మహిళను తీసుకొచ్చిన అంబులెన్స్ ఆ ఆసుపత్రికి చేరుకునే సరికి ఐసీయూ తాళాలు కనిపించలేదు. దీనితో సిబ్బంది ఆ గది తాళాన్ని పగలగొట్టారు. అయితే అప్పటికే ఆ వృద్దురాలు అంబులెన్స్ లోనే ప్రాణాలు విడిచింది. దీనితో ఈ ఘటనకు కారకులైన ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. అటు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, చనిపోయిన మహిళ కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది.
For More News:
ఫ్లాష్: లాక్ డౌన్.. ఇళ్లల్లోనే జనాలు.. ఏపీలో తగ్గిన నేరాలు..
వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా.. ఎమోషనల్ అయిన గెటప్ శ్రీను..
కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కేసులు, 69 వేల మృతులు..
2011 ప్రపంచకప్ ఫైనల్: యువరాజ్ స్థానంలో ధోనిని ముందు వెళ్లమన్నా..
Breaking: ఏపీలో కొత్తగా 14 కరోనా కేసులు.. ఇద్దరు మృతి..
ఫ్లాష్ న్యూస్: దేశంలో 4000 దాటిన పాజిటివ్ కేసులు.. ఆ 11 రాష్ట్రాల్లోనే అత్యధికం…
డేంజర్ బెల్స్: మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపు..!
సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.