ఆయన మరణం దేశానికి తీరని లోటు: ప్రణబ్‌ మృతిపై జగన్ దిగ్భ్రాంతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

ఆయన మరణం దేశానికి తీరని లోటు: ప్రణబ్‌ మృతిపై జగన్ దిగ్భ్రాంతి
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 7:00 PM

Pranab Mukherjee death: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను ప్రణబ్‌‌ పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయమని జగన్ కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ కుటుంబానికి జగన్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగా మెదడుకు శస్త్ర చికిత్స తరువాత కరోనా కూడా సోకడంతో ప్రణబ్‌ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆయన కోమాలోకి వెళ్లారు. ఆదివారం రాత్రి నుంచి సెప్టిక్ షాక్‌లో ఉన్న ప్రణబ్‌.. ఈ సాయంత్రం కన్నుమూశారు.

Read More:

ఏనుగు విసర్జితాలతో టీ.. గడగడా తాగేసిన అక్షయ్‌

బాబుకు మరో షాక్‌.. వైసీసీలో చేరిన చలమలశెట్టి