అదుగో ‘ విక్రమ్ ‘ శకలాలు.. నాసా.. చెన్నై ఇంజనీరుకు ప్రశంసలు
మొత్తానికి విక్రమ్ లాండర్ శకలాల ఆచూకీ దొరికింది. చంద్రయాన్-2 కి సంబంధించిన విక్రమ్ లాండర్ శకలాలు చంద్రుని ఉపరితలంపై కనిపించాయట. జాబిల్లి కక్ష్యలో ఉన్న తమ శాటిలైట్ వాటిని కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. ‘ మా ల్యూనార్ రికన్నాయిజెన్స్ ఆర్బిటర్ (ఎల్ ఆర్ ఓ ) వీటి ఇమేజీలను క్లికే చేసి పోస్ట్ చేసిందని నాసా పేర్కొంది. ఈ లాండర్ కూలిన చోట వాయువ్యంగా దాదాపు 750 కి.మీ. దూరంలో తొలి శకలాన్ని చెన్నైకి చెందిన షణ్ముగ […]
మొత్తానికి విక్రమ్ లాండర్ శకలాల ఆచూకీ దొరికింది. చంద్రయాన్-2 కి సంబంధించిన విక్రమ్ లాండర్ శకలాలు చంద్రుని ఉపరితలంపై కనిపించాయట. జాబిల్లి కక్ష్యలో ఉన్న తమ శాటిలైట్ వాటిని కనుగొన్నట్టు నాసా ప్రకటించింది. ‘ మా ల్యూనార్ రికన్నాయిజెన్స్ ఆర్బిటర్ (ఎల్ ఆర్ ఓ ) వీటి ఇమేజీలను క్లికే చేసి పోస్ట్ చేసిందని నాసా పేర్కొంది. ఈ లాండర్ కూలిన చోట వాయువ్యంగా దాదాపు 750 కి.మీ. దూరంలో తొలి శకలాన్ని చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే ఇంజనీర్ కనుగొన్నాడని ఈ సంస్థ తెలిపింది. అనంతరం ఎల్ ఆర్ ఓ ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను కూడా గుర్తించింది. అక్టోబర్ 14, 15, నవంబరు 11 తేదీల్లో ఈ చిత్రాలను తీసి పంపినట్టు నాసా పేర్కొంది. ఈ ఇమేజీల ప్రకారం .. నీలిరంగు చుక్కలు విక్రమ్ కూలిన కారణంగా ఏర్పడిన చంద్రుని ఉపరితలాన్ని, ఆకుపచ్చని రంగు చుక్కలు లాండర్ శకలాలను చూపుతున్నాయి. ‘ ఎస్ ‘ తో సూచించిన శకలం షణ్ముగ సుబ్రహ్మణ్యన్ కనిపెట్టిందని నాసా స్పష్టం చేసింది.
ఈ లాండర్ శకలాలు కనబడడానికి ముందు, ఆ తరువాత చంద్రుని ఉపరితలం ఎలా ఉందొ కూడా నాసా ఫోటోలను పంపింది. శకలాల ఐడెంటిఫికేషన్ విషయమై షణ్ముగ సుబ్రహ్మణ్యన్ ఎల్ ఆర్ ఓ ప్రాజెక్టు బృందానితో సంప్రదించారని, ఈ సమాచారం అందుకున్న టీమ్ ఆ తరువాతి ఇమేజీలను పోల్చి చూసిందని వెల్లడైంది. సెప్టెంబర్ 7 న చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన ఈ మిషన్ విక్రమ్ లాండర్ చివరి క్షణాల్లో భూమితో కాంటాక్ట్ కోల్పోయింది. అప్పటినుంచి దాని జాడను కనుగొనేందుకు ఇస్రోతో బాటు నాసా కూడా పలు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019