Shaastra Magazine: సైన్స్ మ్యాగజైన్ ‘శాస్త్ర’ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్ పూర్వవిద్యార్ధులు.. ఉపరాష్ట్రపతి అభినందనలు!

|

Jan 31, 2022 | 12:20 PM

సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ ‘శాస్త్ర’ను ప్రారంభించినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఐఐటీ మద్రాస్‌ను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ ఇన్నోవేషన్ రంగంలో తాజా పరిణామాలను..

Shaastra Magazine: సైన్స్ మ్యాగజైన్ ‘శాస్త్ర’ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్ పూర్వవిద్యార్ధులు.. ఉపరాష్ట్రపతి అభినందనలు!
Venkaiah Naidu (File Photo)
Follow us on

IIT Madras launches Science Magazine Shaastra: సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ ‘శాస్త్ర (Shaastra)’ను ప్రారంభించినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vice President Venkaiah Naidu)ఆదివారం ఐఐటీ మద్రాస్‌ (IIT Madras)ను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ ఇన్నోవేషన్ రంగంలో తాజా పరిణామాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ మ్యాగజైన్ ప్రయోజనం చేకూరుస్తుందని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా అన్నారు. కేవలం ఇండియాలోనేకాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న నూతన పోకడలను ఈ పత్రిక అందిస్తుందన్నారు. ఇంకా ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు..

సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ ‘శాస్త్ర’ను తీసుకొచ్చినందుకు ఐఐటీ-మద్రాస్‌ను అభినందిస్తున్నాను. మ్యాగజైన్ శాస్త్రీయ సమాజానికి మాత్రమే కాకుండా, వరల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్‌లోని తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

అలుమ్ని అండ్ కార్పొరేట్ రిలేషన్స్, ఐఐటీ-మద్రాస్ డీన్ అయిన మహేశ్ పంచాగ్ను ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాస్త్ర మ్యాగజైన్‌ను ఐఐటీ-మద్రాస్ దేశానికి అందిస్తుంది. మనదేశంలోని విద్యార్థులు, విధాన నిర్ణేతలు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, కార్పొరేట్ నాయకుల మధ్య సమాచార వేదికగా ఈ మ్యాగజైన్ ఉండబోతోందన్నారు.

కాగా ఐఐటీ మద్రాస్‌లోని 50,000 మంది పూర్వ విద్యార్థుల సహకారంతో ‘శాస్త్ర’ మ్యాగజైన్‌ను ప్రారంభించడం జరిగింది. దేశ, విదేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణలలో చోటుచేసుకుంటున్నతాజా పరిణామాలను తెలియజేయడానికి శాస్ట్ర మ్యాగజైన్ తెలియజేస్తుంది.

Also Read:

ఇంటర్ విద్యనందించడంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం.. కేవలం 10 శాతం మందికే ఆన్‌లైన్ విద్య: సర్వే