
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజికల్ ఆర్కిటెక్ట్, ట్రైనింగ్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ రోజు (మే 10వ తేదీ) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఆర్క్, బీటెక్, బీఈ, డిప్లొమా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్లో ఉత్తీర్ణత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధులకు 35 నుంచి 55 ఏళ్లుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా మే 29, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/career-jobs