UPSC Face Authentication: ఇకపై యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ ముఖ ధ్రువీకరణ తప్పనిసరి!

యూపీఎస్సీ నిర్వహించే నియామక పరీక్షల ప్రామాణికత విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ముఖ ధ్రువీకరణ (Face Authentication) తప్పనిసరి చేస్తూ యూపీఎస్సీ ప్రకటన వెలువరించింది. పరీక్షల నిర్వహణ సమగ్రతను ఇది మరింత బలోపేతం చేస్తుందని

UPSC Face Authentication: ఇకపై యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ ముఖ ధ్రువీకరణ తప్పనిసరి!
face authentication for UPSC Exams

Updated on: Jan 15, 2026 | 9:04 AM

హైదరాబాద్‌, జనవరి 15: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నియామక పరీక్షల ప్రామాణికత విషయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాల్లో ముఖ ధ్రువీకరణ (Face Authentication) తప్పనిసరి చేస్తూ యూపీఎస్సీ ప్రకటన వెలువరించింది. పరీక్షల నిర్వహణ సమగ్రతను ఇది మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన నోట్‌లో UPSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ ముఖ ధృవీకరణ చేయనున్నట్లు పేర్కొంది . దేశంలోని అత్యంత పోటీ పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌తో సహా ఈ వ్యవస్థ బోర్డు అంతటా వర్తిస్తుంది. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) వంటి ఇతర పలు కేంద్ర ప్రభుత్వ ఉగ్యోగాల నియామకాల కోసం వివిధ పరీక్షలు నిర్వహిస్తుంది.

UPSC ప్రతి సంవత్సరం అనేక ఉన్నత స్థాయి నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు పోటీ పడుతుంటారు. సరైన అభ్యర్థి సరైన పరీక్షకు హాజరు అయ్యేలా చూసుకోవడం సవాలుగా మారింది. ఈ క్రమంలోనే ముఖ ప్రామాణీకరణ పద్ధతిని తీసుకువచ్చారు. ఇప్పటికే ఉన్న ధృవీకరణ పద్ధతులకు సాంకేతికతను జోడిస్తుంది. మాన్యువల్ తనిఖీలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది వేషధారణను అరికట్టడానికి, నియామక వ్యవస్థపై నమ్మకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కృత్రిమమేధ ఆధారిత ముఖ ధ్రువీకరణను వినియోగించాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా గతేడాది ఎన్డీయే, నావల్‌ అకాడమీ 2, సీడీఎస్‌ పరీక్షల్లో దీన్ని ఉపయోగించింది.

దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫొటోతో ముఖాలను సరిపోల్చే ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. ఈ ప్రక్రియలో ఒక్కో అభ్యర్థి ధ్రువీకరణ సరాసరి 8 నుంచి 10 సెకన్లలోనే పూర్తవుతుందని యూపీఎస్సీ ఛైర్మన్‌ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వెరిఫికేషన్ సమయంలో, అభ్యర్థులు ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరా ముందు కొద్దిసేపు ఉంటే సరిపోతుంది. లైవ్ ఇమేజ్ రిజిస్ట్రేషన్ ఫోటోగ్రాఫ్‌తో సరిపోలితే అభ్యర్థి పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. మాన్యువల్ జోక్యం అవసరం లేకుండానే ఆటోమెటిక్‌గా జరుగుతుందని అధికారులు తెలిపారు. ముఖ గుర్తింపు ఇప్పుడు తప్పనిసరి కావడంతో, అభ్యర్థులు ఇప్పటికే ఉన్న డాక్యుమెంట్ తనిఖీలతో పాటు ఎంట్రీ పాయింట్ల వద్ద బయోమెట్రిక్ ధృవీకరణకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి ప్రధాన విధానపరమైన మార్పులను కమిషన్ సూచించనప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించిన ఫొటోకి వారి రూపం సహేతుకంగా సరిపోలితేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.