
హైదరాబాద్, జూలై 17: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ఫలితాలు గురువారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీట్ ఫలితాలను ఎన్టీయే విడుదల చేసింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో దాదాపు 8 మంది ఏకంగా 690కిపైగా స్కోర్ సాధించారు. 690కి పైగా స్కోర్ సాధించిన 138 మంది టాపర్లలో తెలంగాణ విద్యార్థులు వీరే..
కాగా నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్కు దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఇందులో 11.21 లక్షల మంది అర్హత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. దీంట్లో 58 శాతంపైగా అమ్మాయిలే ఉండటం గమనార్హం. మొత్తం 720 మార్కులకుగాను 705కుపైగా మార్కులు సాధించి 17 మంది టాపర్లుగా నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు విద్యార్థులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి మొత్తం 65,087 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు.