TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

|

Jan 28, 2022 | 7:54 PM

పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పెంచుతూ తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు తుది గడువు ఈ నెల (జనవరి) 29తో ముగియనుండగా దాన్ని వచ్చేనెల..

TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
Telangana
Follow us on

TS SSC Exams 2022 Fee last date: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పెంచుతూ తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు తుది గడువు ఈ నెల (జనవరి) 29తో ముగియనుండగా దాన్ని వచ్చేనెల (ఫిబ్రవరి) 14 వరకు పొడిగించింది. ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని విద్యార్ధులకు బోర్డు సూచిందింది. కాగా ఈ ఏడాది తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

Also Read:

Constable Jobs: గుడ్‌న్యూస్! 1149 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే..