Law Course in SKU: ‘న్యాయశాస్త్ర కోర్సును కొనసాగిస్తాం..’ వెనక్కి తగ్గిన శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి లా అడ్మిషన్లను నిలిపివేయవల్సిందిగా కోరుతూ ఉన్నత విద్యామండలికి వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ లేఖ రాసిన సంగతి విధితమే. యూనివర్సిటీ సమస్యలపై విద్యార్ధులు గళం విప్పడం..

Law Course in SKU: న్యాయశాస్త్ర కోర్సును కొనసాగిస్తాం.. వెనక్కి తగ్గిన శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ అధికారులు
Sri Krishnadevaraya University

Updated on: Dec 08, 2022 | 6:16 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి లా అడ్మిషన్లను నిలిపివేయవల్సిందిగా కోరుతూ ఉన్నత విద్యామండలికి వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ లేఖ రాసిన సంగతి విధితమే. యూనివర్సిటీ సమస్యలపై విద్యార్ధులు గళం విప్పడం మూలంగానే న్యాయ శాస్త్ర ప్రవేశాలను నిలిపివేస్తున్నారంటూ పలు వార్తా సంస్థలు కథనాలు వెలువరించడంతో వర్సిటీ అధికారులు వెనక్కి తగ్గారు. 52 ఏళ్ల నుంచి న్యాయశాస్త్రం కోర్సులు నిర్వహిస్తున్న వర్సిటీ.. విద్యార్ధులపై కక్ష్య సాధింపు ఉద్ధేశ్యంతో మూడేళ్ల లా కోర్సుల అడ్మిషన్లను నిలిపివేస్తున్నారని వరుస కథనాలు వెలువడ్డాయి. పైగా లా’ విభాగంలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌తోపాటు, 8 తాత్కాలిక ఫ్యాకల్టీతో కలిపి మొత్తం 10 మంది అధ్యపకులు ఉంటే..ఫ్యాకల్టీ కొరత వల్లనే కోర్సు కొనసాగించలేమని అధికారులు చెప్పడం వెనుక మర్మమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు.. ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నా కోర్సు నిర్వహించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందని, కోర్సును కొనసాగించవల్సిందేనని విద్యార్ధుల సంఘాలు సైతం ఆందోళ చేపట్టారు. ఇక దీనిపై స్పందించిన సీపీఐ స్టేట్‌ సెక్రటరీ రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరికి కోర్సును కొనసాగించాలని కోరుతూ లేఖలు రాశారు. చేసేది లేక లా కోర్సును కొనసాగిస్తామని వీసీ అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us