
దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న యువతకు భారత వాయుసేన మరో గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అగ్నిపథ్ పథకం కింద ‘అగ్నివీర్ వాయు (02/2027) బ్యాచ్’ నియామకాల కోసం ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్లపాటు భారత వాయుసేనలో అగ్నివీర్గా సేవలందించే అవకాశం పొందుతారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, జీతభత్యాలు, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి.
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. లేదా సైన్స్ కాని ఇతర సబ్జెక్టులతో ఇంటర్/వొకేషనల్ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. లేదా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
2005 జులై 1 నుంచి 2010 జనవరి 1 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
పురుషులు, మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
ఈశాన్య రాష్ట్రాలు లేదా ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాలకు చెందిన మహిళలకు కనీస ఎత్తు 147 సెం.మీ.గా నిర్ణయించారు.
ఎంపికైన అగ్నివీర్లకు ప్రతి ఏడాది జీతం పెరుగుతూ ఉంటుంది.
అదనంగా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. నాలుగేళ్ల సేవ పూర్తయ్యాక సుమారు రూ.10.04 లక్షల సేవా నిధి (వడ్డీ మినహా) అందజేస్తారు.
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది. దేశానికి సేవ చేయాలనే సంకల్పం ఉన్న యువతకు ఇది ఒక మంచి అవకాశం. అర్హతలు ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి