
అమరావతి, మే 27: సాధారణంగా పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఆయా ప్రభుత్వ ఉద్యోగాలకు కొన్ని రకాల సర్టిఫికెట్లు తప్పనిసరి. అయితే అనేక మంది అలసత్వమో, నిర్లక్ష్యమో తెలియదుగానీ చివరి నిమిషం వరకు వాటిని సమకూర్చుకునే ప్రయత్నం చేయరు. తీరా అత్యవసరమ్యే సమయంలో ఉరుకులు పరుగులు తీస్తూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతుంటారు. మరి కొందరు దళారులకు డబ్బు ఎరగా వేసి ఠంచన్గా సర్టిఫికెట్లను పొందుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రవేశాలకు విద్యార్థులకు అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలు ఎంత అవసరమో.. మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయంలోనూ అంతే అవసరం. ఏ ఒక్క పత్రం లేకున్నా వచ్చిన అవకాశం చేజారి పోతుంది. ముందుగానే తీసుకుని అందుబాటులో ఉంచుకోవడం ఆందోళన ఉండదు. పనులు సులభంగా అయిపోతాయి. త్వరలో విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారిక నిబంధనల ప్రకారం పై పత్రాలు తీసుకోవాలంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత 7 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. కొన్నిచోట్ల ఒకటి, రెండు రోజుల్లో కూడా అందిస్తున్నారు. మరికొన్నిచోట్ల నెలలపాటు వేచి చూడవల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. ఈ ధ్రువపత్రాలకు మీసేవలో రూ.45 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.