
న్యూఢిల్లీ, మే 12: ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షలు మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICAI తెలిపింది. దీంతో సీఐ ఫైనల్, ఇంటర్మీడియట్, ఐఎన్టీటీ-ఏటీ (పీక్యూసీ) పరీక్షలను మే 16 నుంచి 24 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఐసీఏఐ తన ప్రకటనలో తెలిపింది.
రీషెడ్యూల్ చేయబడిన పరీక్షలు అవే పరీక్షా కేంద్రాలలో, అదే సమయాలలో అంటే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేయబడిన అడ్మిట్ కార్డులు రీషెడ్యూల్ చేయబడిన తేదీలకు చెల్లుబాటులో ఉంటాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.