
అమరావతి, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. ఈ పోస్టుల్లో ఇప్పటికే ఒప్పంద పద్ధతిలో కొనసాగుతున్న బోధనా సిబ్బందిని మరో ఏడాదిపాటు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేంత వరకూ లేదంటే సంవత్సరం పాటు వీరిని కొనసాగించాలని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి నెలకు రూ.57,700 చొప్పున వేతనం చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.
తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు తుది విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. నవంబరు 29 వరకు అంటే రేపటి వరకు ఈ తుది కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అగ్రి వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య నవంబరు 27న ఎ ప్రకటనలో తెలిపారు. మూడు విశ్వవిద్యాలయాల్లోని వివిధ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సులలో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్ను ఈ మేరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లో సందర్శించాలని తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.