
CBSE Class 10 Second Board Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి సెకండరి బోర్డు తుది ఫలితాలను విడుదల చేసింది. సెకండరి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను అధికారిక CBSE వెబ్సైట్ cbse.gov.in, లేదా DigiLocker వెబ్సైట్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు.
జాతీయ విద్యా విధానం (NEP) 2020 కింద, CBSE 10వ తరగతి విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది. ప్రధాన పరీక్షను 2026 ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 వరకు నిర్వహించగా, రెండవ పరీక్షను 2026 మే 15 నుండి మే 21 వరకు నిర్వహించారు.
బోర్డు ప్రకారం, రెండవ పరీక్ష కోసం మొత్తం 664,027 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 663,777 మంది హాజరయ్యారు. చాలా మంది విద్యార్థులు ప్రధాన పరీక్షలో తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ రెండవ పరీక్ష విద్యార్థులకు మెరుగైన ఫలితాలను సాధించడానికి ఒక అదనపు అవకాశాన్ని అందిస్తుంది.
పనితీరులో 59.95% మెరుగుదల
మెరుగుదల పరీక్షకు హాజరైన 5,13,955 మంది అభ్యర్థులలో, 3,08,095 మంది విద్యార్థులు తమ పనితీరును మెరుగుపరుచుకున్నారు. ఇది 59.95 శాతంగా ఉంది. రెగ్యులర్ విద్యార్థుల విషయంలో, రెండు పరీక్షలలోనూ వచ్చిన అధిక స్కోరును తుది ఫలితం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు తమ మార్క్షీట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి డిజిలాకర్ లేదా సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలని సూచించారు అధికారులు.