APPSC Notification 2022: లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌.. అర్హతలు, ఎంపిక విధానం వంటి వివరాలు ఇవే..

|

Sep 30, 2022 | 10:00 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) హోమియో, ఆయుష్‌ విభాగాల్లో.. 34 హోమియో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

APPSC Notification 2022: లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌.. అర్హతలు, ఎంపిక విధానం వంటి వివరాలు ఇవే..
APPSC Lecturers Recruitment 2022
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) హోమియో, ఆయుష్‌ విభాగాల్లో.. 34 హోమియో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫార్మసీ, మెటీరియా మెడికా, ఆర్గాన్ ఆన్ అండ్‌ ఫిలాసఫీ, రెపర్టరీ, అనాటమీ, ఫిజియాలజీ, మెడిసిన్/ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్, పాథాలజీ అండ్‌ మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, సర్జరీ, ఆబ్‌స్టెట్రిక్‌ అండ్‌ గైనకాలజీ, కమ్యూనిటీ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హోమియోపతి ఆసుపత్రిలో ఆర్‌ఎమ్‌ఓ లేదా హౌస్‌ ఫిజీషియన్స్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 7, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులు అక్టోబర్‌ 22వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో జనవర్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో 150 మార్కులకు, 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండో పేపర్ హోమియోపతిలో సంబంధిత సబ్జెక్టుల్లో 150 ప్రశ్నలకు 300 మార్కులకుగానూ, 150 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఇంగ్లిష్‌ మాద్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 450 మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. సిలబస్‌ వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.