APPSC Govt Jobs: ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు తుది గడువు పొడిగింపు.. మరో వారం పాటు..

|

Jan 29, 2022 | 2:31 PM

ఏపీ ఎండోమెంట్స్ సబ్-సర్వీస్‌ (A.P. Endowments Sub-Service)లోని ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీని ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది.

APPSC Govt Jobs: ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు తుది గడువు పొడిగింపు.. మరో వారం పాటు..
Appsc
Follow us on

APPSC Executive Grade-III Recruitment 2022 last date: ఏపీ ఎండోమెంట్స్ సబ్-సర్వీస్‌ (A.P. Endowments Sub-Service)లోని ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ చివరి తేదీని ఏపీపీఎస్సీ (APPSC) పొడిగించింది. నిరుద్యోగ యువత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ దరఖాస్తుల సమర్పణ తేదీని వచ్చేనెల (ఫిబ్రవరి) 6 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు తాజాగా ప్రకటించింది. ఫిబ్రవరి 5, 2022 అర్ధరాత్రి 11 గంటల 59 నిముషాల వరకు ఫీజు చెల్లించడానికి తుది గడువుగా తెల్పింది.  కాగా ఏపీపీఎస్సీ విడుదల చేసిన సబ్ ఏపీ ఎండోమెంట్స్ సబ్-సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-III పోస్టులకు దరఖాస్తుల సమర్పణ నేటితో ముగియనుంది. తాజా ప్రకటనతో మరో 5 రోజులపాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు తెల్పింది.

దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనుంది. జూలై 1, 2021 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్ధులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైతే రూ.16,400/- నుండి 49,870/- వరకు జీతంగా చెల్లిస్తారు.

Also Read:

TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..