
ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలక కార్యాలయం (DME) రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 234 ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 15 నుంచి జులై 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎండీ, ఎంఎస్ లేదా డీఎన్బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన వారికి నెలకు రూ.80,500 వేతనం చెల్లించనున్నారు.
దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.2,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. పీజీ పరీక్షలో (థియరీ, ప్రాక్టికల్) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలు అమలు చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు MD/ MS/ DNBలో ఉత్తీర్ణతతోపాటు AP Medical Councilలో Registration చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయస్సు 44 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో జులై 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.2,000, BC/ SC/ ST అభ్యర్ధులు రూ.1,000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.