
అమరావతి, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా జారీ చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అయితే ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ (SA) కొలువులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,010 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ (SA) పరీక్షలు జూన్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఎగ్జామినేషన్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ కేటగిరీలో అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 7,487 పోస్టులు ఉన్నాయి. ఏ సబ్జెట్ పరీక్ష ఏ తేదీన జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
ఏపీ మెగా డీఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.