
అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు సంబంధించి టైం టేబుల్లో స్వల్ప మార్పు చేసినట్లు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం ఉగాది పండగ మార్చి 20వ తేదీన వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నిర్వహించనున్న ఇంగ్లిష్ పరీక్షను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంగ్లిష్ పరీక్ష మార్చి 21వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్ధులు, విద్యాసంస్థలు, విద్యార్ధుల తల్లిదండ్రులు గమనించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ పరీక్ష తేదీ మారిన నేపథ్యంలో కొత్త టైం టేబుల్ ఈ కింది విధంగా ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.