కరోనా ధాటికి.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రద్దు..?
చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని కారణంగా ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 5000 మంది మరణించారు. లక్షకు పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో
చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు 134 దేశాలకు వ్యాపించింది. దీని కారణంగా ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 5000 మంది మరణించారు. లక్షకు పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రభావంతో పెద్ద పెద్ద ఈవెంట్స్ రద్దు అవుతున్నాయి. భారత్లో ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా కారణంగా.. ప్రతీ ఏడాది వేసవిలో ప్రాన్స్ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రద్దు అయ్యే అవకాశాలున్నాయాని తెలుస్తోంది. ఈ ఏడాది క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 12న మొదలు కావాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ ఫెస్టివల్ జరుగుతుందో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. ‘మార్చి నెలాఖరులోగా కరోనా తీవ్రత తగ్గుతుందనే ఆశతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఫెస్టివల్ను రద్దు చేసే అవకాశం ఉంది’ అన్నారు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెసిడెంట్ పీర్రీ లీస్కూర్.
Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు!