కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ఈ 4 శాతం డీఏ పెంపు 2020 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది,
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4% డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. ఈ 4 శాతం డీఏ పెంపు 2020 జనవరి 1 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది, అంటే మార్చి 2020 జీతం మరియు పెన్షన్ సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినప్పుడు, వారికి రెండు నెలల (జనవరి మరియు ఫిబ్రవరి ) ఎరియర్స్ వస్తాయి. ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం ఉన్న 35 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు వర్తిస్తుంది.
ఈ 4 శాతం డీఏ ప్రకటన తరువాత, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి జీతం నెలకు రూ .720 నుంచి రూ .10 వేలకు పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సార్లు డీఏను పెంచుతూ ఉంటుంది. తాజాగా 4 శాతం డీఏ పెంపు 2020 తొలి అర్ధ భాగానికి అంటే ఆరు నెలల కాలానికి వర్తిస్తుంది. దీంతో జనవరి డీఏ ఇప్పుడు 21 శాతానికి చేరింది. ప్రస్తుతం డీఏ 17 శాతంగా ఉంది.
[svt-event date=”13/03/2020,4:03PM” class=”svt-cd-green” ]
Union Cabinet has approved an increase of 4 % #Dearness Allowance to Central Government employees and Dearness Relief to pensioners with effect from 1st January, 2020. This is over the existing rate of 17% of the Basic Pay/Pension. https://t.co/ZcSipBwtFK
— ANI (@ANI) March 13, 2020
[/svt-event]