
స్వదేశీ టెక్నాలజీ సంస్థగా పాపులర్ అవుతున్న జోహో కంపెనీ ఇటీవల అరట్టై యాప్తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కంపెనీ త్వరలోనే కొత్త యూపీఐ యాప్ ను కూడా లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న యూపీఐ యాప్స్ కంటే మెరుగైన ఫీచర్లు ఈ యాప్లో ఉండబోతున్నాయని టాక్. మరి ఈ యాప్ ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జోహో కార్ప్కు సంబంధించిన ‘జోహో పే (Zoho Pay)’ యాప్.. యూపీఐ ఆధారిత పేమెంట్ల కోసం డిజైన్ చేసిన యాప్. ఇది కూడా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ లాగానే పనిచేస్తుంది. ఇందులో డబ్బు సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, బిల్లులు చెల్లించడం, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేయడం వంటి ఫీచర్లు ఉంటాయి. వీటితోపాటు ఇందులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. పెమెంట్ చేసే టైంను మరింత తగ్గించేలా ఇన్స్టంట్ పేమెంట్ సిస్టమ్ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే అరట్టై యాప్తో జోహో పే ను లింక్ చేసుకుని ఫ్రెండ్స్కు ఈజీగా పేమెంట్స్ చేసేలా ఆప్షన్ ఉండబోతోందట.
ప్రస్తుతానికి, జోహో పే యాప్ లాంచ్ తేదీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ, అత్యంత త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. జోహో సంస్థ ఇప్పటికే పేమెంట్-అగ్రిగేటర్ లైసెన్స్ కలిగి ఉంది. జోహో బిజినెస్ ద్వారా మర్చంట్ పేమెంట్లను కూడా అందిస్తుంది. త్వరలోనే యూపీఐ పేమెంట్స్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి, ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. 2026 మొదట్లో ఈ యాప్ అందుబాటులోకి రావొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.