
సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగులకు జీతం ఇస్తుంటారు. కొన్ని కంపెనీల్లో పండగలకు బోనస్లు, బాగా పని చేసిన వారికి బెటర్ ఇంక్రిమెంట్లు ఇస్తుంటారు. ప్రమోషన్లు, ఆన్సైట్లు వంటి ఆఫర్లు కూడా ఇస్తారు. కానీ, ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా రూ.1.5 కోట్ల ప్లాట్లను గిఫ్ట్గా ఇచ్చింది. జెజియాంగ్ గుషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ తన అత్యంత విశ్వసనీయ ఉద్యోగులలో కొంతమందికి స్వంత ఇంటిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. మూడేళ్ల కాలంలో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు 18 నివాస ఫ్లాట్లను పంపిణీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఇళ్ల విలువ రూ. 1.3 కోట్ల నుండి రూ. 1.5 కోట్ల మధ్య ఉంటుంది.
జెజియాంగ్ గుయోషెంగ్ ఆటోమోటివ్ టెక్నాలజీ అనేది ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలతో ప్రయోగాలు చేసే చిన్న స్టార్టప్ కాదు. ఈ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీదారు 450 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. 2024లో దాదాపు 70 మిలియన్ డాలర్ల అవుట్పుట్ విలువను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కంపెనీలో చాలామంది వలస కార్మికులు, వారి కార్యాలయానికి సమీపంలో శాశ్వత గృహాలు లేవు. కంపెనీ జనరల్ మేనేజర్ వాంగ్ జియాయువాన్ ప్రకారం, పని కోసం రాష్ట్రాలకు వెళ్లే ఉద్యోగులు ఎదుర్కొనే వాస్తవాలను నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ గృహనిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించారు. చాలా మందికి, పారిశ్రామిక స్థావరం దగ్గర దీర్ఘకాలిక అద్దెకు తీసుకోవడం ఖరీదైనది. అందుకే వారి కోసం ఫ్లాట్-అలోకేషన్ పథకం రూపొందించారు.
ఈ సంవత్సరం మేం ఐదు ఫ్లాట్లను పంపిణీ చేశాం. వచ్చే ఏడాది మరో ఎనిమిదింటిని కేటాయించాలని మేం ప్లాన్ చేస్తున్నాం, మూడు సంవత్సరాలలో మొత్తం 18 ప్లాన్ చేస్తున్నాం అని వాంగ్ చెప్పారు. ఈ ఫ్లాట్లన్నీ కంపెనీ పారిశ్రామిక స్థావరం నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉండటం వలన రోజువారీ ప్రయాణ సమయం తగ్గుతుంది. ఉద్యోగులకు పని-జీవిత లాజిస్టిక్స్ సులభతరం అవుతుంది. ప్రతి యూనిట్ 100, 150 చదరపు మీటర్ల మధ్య ఉంటుంది, అంటే దాదాపు 1,076 నుండి 1,615 చదరపు అడుగుల వరకు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి