World’s Richest Man: ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?

|

Sep 11, 2024 | 8:56 PM

మన దేశానికి చెందిన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు అత్యధిక ధనవంతుల జాబితాలో ఎప్పుడూ కనిపిస్తారు. ప్రపంచంలో ఇప్పుడు అందరూ ధనవంతులూ బిలియనీర్లే. ట్రిలియనీర్ స్థాయికి ఇంకా ఏ ఒక్కరూ ఎదగలేదు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ ఎవరు అవుతారనే విషయంపై చర్చ జరుగుతోంది.

Worlds Richest Man: ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
Who Will Be World's First Trillionaire
Follow us on

ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆ జాబితాలో అనేక మంది వ్యాపార దిగ్గజాల పేర్లు మనకు వినిపిస్తాయి. వారి సంపద విషయంలో కొన్నిసార్లు హెచ్చుతగ్గులుంటాయి. జాబితాలో స్థానాలు మారుతూ ఉంటాయి. అయినప్పటికీ మనందరికీ వారిపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మన దేశానికి చెందిన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు అత్యధిక ధనవంతుల జాబితాలో ఎప్పుడూ కనిపిస్తారు. ప్రపంచంలో ఇప్పుడు అందరూ ధనవంతులూ బిలియనీర్లే. ట్రిలియనీర్ స్థాయికి ఇంకా ఏ ఒక్కరూ ఎదగలేదు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ ఎవరు అవుతారనే విషయంపై చర్చ జరుగుతోంది. అత్యధిక ధనవంతులైన ఎలాన్ మస్క్, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ లలో ఎవరికీ అవకాశం ఉందో తెలుసుకుందాం.

నివేదిక ప్రకారం..

ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ ఎవరు అవుతారనే విషయంపై ఇటీవల ఓ నివేదిక విడుదలైంది. ప్రస్తుతం ధనవంతులైన పలువురి ఆస్తుల పెరుగుదలను ఆధారంగా చేసుకుని అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం స్పేస్ ఎక్స్ సంస్థ సీఈవో అయిన ఎలోన్ మాస్క్ 2027 నాటికి ట్రిలియనర్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన సంపద పెరుగుతున్న తీరు అలాగే కొనసాగితే మస్క్ ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా రికార్డు నెలకొల్పుతారు. ఇప్పటికే ఆయన 237 బిలియన్ల యూఎస్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.

2028లో గౌతమ్ అదానీ..

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి కూడా ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సంపద పెరుగుతున్న లెక్కప్రకారం 2028 నాటికి ఆ ఘనత సాధిస్తారు. ప్రస్తుతం అదానీ షేర్ సంపద 100 బిలియన్ డాలర్ల కన్నా తక్కువే. సంపద విషయంలో ఆయన 13వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద 123 శాతం చొప్పున పెరుగుతోంది. ఇదే కొనసాగితే 2028 నాటికి ట్రిలియనీర్ అవుతారు.

2033లో ముఖేష్ అంబానీ..

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ట్రిలియనీర్ అయ్యే జాబితాలో ఉన్నారు. ఈయన సంపద సగటున 28.25 శాతం వార్షిక రేటుతో పెరుగుతోంది. ఇదే కొనసాగితే 2033 నాటికి ఆయనకు ట్రిలియనీర్ అయ్యే అవకాశం లభిస్తుంది. వీరితో పాటు ప్రపంచంలోని ప్రముఖులైన జెన్ సన్ హువాంగ్, ప్రజోగో పాంగెేస్టు, బెర్నార్డ్ ఆర్నాల్డ్, మార్క్ జూకర్ బర్గ్ తదితరులు కూడా ట్రిలియనీర్ జాబితాలో చేరే అవకాశం ఉంది.

ట్రిలియనీర్ అంటే..

ఒక బిలియన్ డాలర్ అంటే 8500 కోట్ల రూపాయల సంపద కలిగిన వారిని బిలియనీర్లు అంటారు. ట్రిలియనీర్ కావాలంటే లక్ష కోట్ల డాలర్ల సంపద ఉండాలి. అంటే 85 లక్షల కోట్ల విలువైన ఆస్తిని సంపాందించాలి. ప్రస్తుతం ఎలోన్ మస్క్ ఆస్తి విలువ 251 బిలియన్ డాలర్లు. ఆయన సంపద 110 శాతం రేటులో పెరుగుతోంది. ఇదే కొనసాగితే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ గా మారతారు. ప్రపంచంలో మొదటి ట్రిలియనీరు ఎవ్వరు అవుతారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..