AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా సుంకాలతో ఇండియాకు నష్టం కంటే లాభమే ఎక్కువ! ఎలాగంటే..?

అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం ఉండొచ్చునని, అయితే దీర్ఘకాలంలో వృద్ధికి దోహదం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. GDPలో 0.5 శాతం తగ్గుదల సంభవించే అవకాశం ఉంది. భారతదేశం వ్యూహాత్మకంగా వాణిజ్య సంబంధాలను విస్తరించడం ద్వారా ప్రతిస్పందిస్తోంది.

అమెరికా సుంకాలతో ఇండియాకు నష్టం కంటే లాభమే ఎక్కువ! ఎలాగంటే..?
Pm Modi And Donald Trump
SN Pasha
|

Updated on: Aug 29, 2025 | 7:16 PM

Share

అమెరికా విధించిన 50 శాతం సుంకం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారవచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు. జిడిపి వృద్ధి రేటు 2 శాతం తగ్గవచ్చని అంచనా. అయితే అమెరికా విధించిన ఈ సుంకాల భారత్‌కు ప్రయోజనకరంగా ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ నిపుణుడు ప్రొఫెసర్ మాధవ్ దాస్ నలపట్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వార్తా ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాధవ్ నలపట్ మాట్లాడుతూ.. అమెరికా సుంకాల చర్యల కారణంగా భారతదేశం 0.5 శాతం నష్టపోవచ్చని అన్నారు. అయితే, జిడిపిని 2-3 శాతం పెంచడం కూడా సాధ్యమే అన్నారు. సుంకాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థకు తాత్కాలికంగా ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, దీర్ఘకాలంలో అభివృద్ధి వేగాన్ని పెంచే అవకాశం ఉంది.

స్వల్పకాలంలో ఎగుమతి హెచ్చుతగ్గుల కారణంగా GDP వృద్ధి 0.5 శాతం తగ్గవచ్చు. అయితే ఎగుమతి మార్కెట్లను విస్తరించడం, తయారీ రంగాన్ని పెంచడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా భారతదేశం దీర్ఘకాలికంగా 2-3 శాతం ఎక్కువ వృద్ధి చెందగలదు అని మాధవ్ దాస్ వివరించారు. అమెరికా బెదిరింపు వ్యూహం, ‘అమెరికా ఫస్ట్’ విధానం భారత్‌కు ప్రతికూలంగా మారుతోంది. అయితే భారత్‌ దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి బదులుగా వ్యూహాత్మకంగా వాణిజ్యాన్ని విస్తరించడం ద్వారా అమెరికాకు ప్రతిస్పందిస్తోంది. బ్రిక్స్, ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా భారతదేశం అమెరికాకు ప్రోత్సాహాన్ని ఇవ్వగలదని ప్రొఫెసర్ మాధవ్ విశ్వసిస్తున్నారు.

భారతదేశంలో మంచి ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రెడిట్ ఏజెన్సీలు భారతదేశం, రేటింగ్‌ను తగ్గించలేదు. అమెరికన్ కంపెనీలు భారతదేశంలో తమ పెట్టుబడులను విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ అంశాలు భారతదేశానికి మంచి వృద్ధి వేగాన్ని తెస్తాయని నలపట్ అన్నారు. సో ఆయన లెక్కల ప్రకారం అమెరికా విధించిన సుంకాలు భారత్‌కు కాస్త నష్టంతో పాటు రానున్న కాలంలో మంచే చేయనున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి