UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు.. కేంద్రం కీలక ప్రకటన

UPI Payments: ఈ నిబంధన చెల్లింపు చేసేవారికి , అందుకునే వారికి రెండు వైపులా వర్తిస్తుంది. ఇది 2007 పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏ సవరణ తర్వాత వచ్చిన మొదటి నోటిఫికేషన్. గతంలో అన్ని యూపీఐ లావాదేవీలపై జీరో..

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేవు.. కేంద్రం కీలక ప్రకటన
Upi Payments

Edited By:

Updated on: Sep 15, 2026 | 7:54 PM

UPI Payments: ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కొత్త నిబంధనలను విడుదల చేసింది. సెప్టెంబర్ 14, 2026న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, 2,000 వరకు ఉన్న యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు , పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు.

ఈ నిబంధన చెల్లింపు చేసేవారికి , అందుకునే వారికి రెండు వైపులా వర్తిస్తుంది. ఇది 2007 పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏ సవరణ తర్వాత వచ్చిన మొదటి నోటిఫికేషన్. గతంలో అన్ని యూపీఐ లావాదేవీలపై జీరో ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) వర్తించేది. ఇప్పుడు ప్రభుత్వం ఏ ఏలక్ట్రానిక్ పేమెంట్ మోడ్‌లపై ఛార్జీలు ఉండకూడదని నిర్ణయించుకునే అధికారం కలిగి ఉంది.

అక్టోబర్ 15 నుంచి ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI లావాదేవీలపై ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను అమలు చేయబోతోంది. దీని ప్రకారం, రూ. 2000 పైబడిన లావాదేవీలపై వ్యాపారులు 0.4% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులపై గరిష్ట రుసుము రూ. 300గా ఉంటుంది. ఈ విషయమై ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి రూ. 2000 పైబడిన లావాదేవీలపై ఛార్జీ విధించవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.

కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా 2,000 వరకు యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగా ఉంటాయి. రూపే డెబిట్ కార్డు చెల్లింపులు మొత్తం ఉచితంగా ఉంటాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) యూపీఐ బదిలీలు ఉచితంగా కొనసాగనున్నాయి.

ఇది వినియోగదారులపై కాకుండా వ్యాపారులపైనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం 2,000 లోపు ఉన్నాయి. అందుకే అత్యధిక మంది వినియోగదారులకు ఎలాంటి మార్పు ఉండదు. ప్రభుత్వం ఈ చర్యను డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సుస్థిరంగా ఉంచడానికి తీసుకున్న నిర్ణయంగా అభివర్ణిస్తోంది. వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా, బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

  • సాధారణ వినియోగదారులు: వినియోగదారులకు పూర్తిగా ఉచితం: సాధారణ పౌరులు UPI ద్వారా చేసే చెల్లింపులకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • P2P లావాదేవీలు: ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు లేదా ఒకరి ఖాతా నుండి మరొక ఖాతాకు పంపుకునే డబ్బు (P2P) పై ఎప్పటికీ ఛార్జీలు ఉండవు.
  • యాప్ ప్లాట్‌ఫారమ్ ఫీజు లేదు: పేమెంట్ యాప్‌లు (Google Pay, PhonePe మొదలైనవి) ఎలాంటి ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు.
  • QR కోడ్ స్కాన్: దుకాణాలు, వీధి వ్యాపారుల వద్ద QR కోడ్ స్కాన్ చేసి ఎంత మొత్తం పంపినా వినియోగదారులకు ఉచితమే.
  • వస్తువుల ధరలు పెరగవు: MDR అనేది వ్యాపారులు భరించే వ్యాపార వ్యయం మాత్రమే, దీనిని కస్టమర్ల నుండి వసూలు చేయడానికి వీల్లేదు.
  • ఆటో-డెబిట్ (UPI Mandates/AutoPay): మ్యూచువల్ ఫండ్స్, OTT చందాలు, కరెంట్ బిల్లుల ఆటో-డెబిట్ చెల్లింపులపై కూడా ఎలాంటి MDR ఉండదు.

చిన్న, మైక్రో వ్యాపారులు (P2PM):

  • P2PM వ్యాపారులకు 0% MDR: నెలకు UPI ద్వారా రూ.1 లక్ష వరకు స్వీకరించే చిన్న/వీధి వ్యాపారులను (P2PM) ఎటువంటి MDR ఛార్జీలు లేకుండా మినహాయించారు.
  • QR కోడ్‌లు మార్చాల్సిన అవసరం లేదు: పాత QR కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు యథావిధిగా పనిచేస్తాయి.
  • GST నమోదు తప్పనిసరి కాదు: జరో-MDR ప్రయోజనం పొందడానికి చిన్న వ్యాపారులకు GST రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
  • వరుసగా 3 నెలల పాటు నెలకు రూ.1 లక్ష కంటే ఎక్కువ UPI చెల్లింపులు పొందే వ్యాపారులను బ్యాంకులు P2M (కమర్షియల్) కేటగిరీకి మారుస్తాయి.
  • కొన్ని నిర్దిష్ట రంగాలలో ఆమోదయోగ్యమైన ఫ్లాట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి (₹2,000 దాటిన లావాదేవీలపై):

రూ. 5 ఫ్లాట్ MDR (రూ.2,000 పైబడిన లావాదేవీలకు):

  • పెట్రోల్ బంకులు (Fuel)
  • ఇన్సూరెన్స్ ప్రీమియంలు (Insurance)
  • ప్రభుత్వ బిల్లులు / యుటిలిటీస్ (కరెంట్, వాటర్ మొదలైనవి)
  • భారతీయ రైల్వేలు (Railways)
  • టెలికాం సేవలు (Telecom)
  • విద్యా సంస్థల ఫీజులు (Educational Institutions)
    (ఈ రంగాలలో రూ.2,000 దాటి ఎంత పెద్ద లావాదేవీ చేసినా వ్యాపారి చెల్లించాల్సిన ఫ్లాట్ రుసుము కేవలం రూ.5 మాత్రమే.)
Loading...
Unable to load recommendations.
Follow Us