Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో కోటి మందికి పైగా పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU) పూర్తి చేసి కీలక మైలురాయి సాధించింది. 5 నుండి 15 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిష్ అప్డేట్ తప్పనిసరి.

Aadhaar: కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌ చేసిన UIDAI.. ఎందుకంటే..?
Aadhaar Updates

Updated on: Feb 09, 2026 | 6:00 AM

దేశవ్యాప్తంగా 83 వేల పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్‌ (MBU) పూర్తి చేయడం ద్వారా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. UIDAI ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఫోటో, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రం మాత్రమే అవసరం. ఈ వయస్సులో పిల్లల వేలిముద్రలు, కనుపాపలు పూర్తిగా అభివృద్ధి చెందవు, కాబట్టి ఈ బయోమెట్రిక్ సమాచారం నమోదు చేయబడదు. అందువల్ల 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత MBU అని పిలువబడే ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిష్‌ సమాచారాన్ని అప్టేడ్‌ చేయడం తప్పనిసరి.

ఆధార్‌లో MBUని సకాలంలో అమలు చేయకపోతే, పిల్లలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో, గుర్తింపు ధృవీకరణలో, NEET, JEE, CUET వంటి పోటీ, విశ్వవిద్యాలయ పరీక్షలకు నమోదు చేసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి UIDAI పాఠశాల-కేంద్రీకృత ప్రచారాన్ని ప్రారంభించింది.

సెప్టెంబర్ 2025లో ప్రారంభించబడిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో UIDAI సాంకేతిక ఏకీకరణ విద్యా మంత్రిత్వ శాఖ UDISE+ వ్యవస్థతో ముడిపడి ఉంది. దీని వలన ఏ పిల్లల MBUలు పెండింగ్‌లో ఉన్నాయో పాఠశాలలు స్పష్టంగా చూడటానికి వీలు ఏర్పడింది. పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్లను సులభంగా పూర్తి చేయడానికి వీలుగా పాఠశాల క్యాంపస్‌లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us