SVAMITVA Scheme: 65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డులు పంపిణీ చేసిన మోదీ

SVAMITVA Scheme: అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా సర్వే చేసేందుకు స్వామిత్వ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కలిగి ఉన్న కుటుంబాలకు 'రికార్డ్ ఆఫ్ రైట్స్' అందించడం ద్వారా గ్రామీణ భారత ఆర్థిక ప్రగతిని పెంపొందించే లక్ష్యంతో పనులు జరిగాయి. .

SVAMITVA Scheme: 65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డులు పంపిణీ చేసిన మోదీ

Updated on: Jan 18, 2025 | 2:44 PM

SVAMITVA Scheme: సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్‌డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌ (SVAMITVA) పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 65 లక్షల కుటుంబాలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఈ స్వామిత్ర పథకం కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని 230కి పైగా జిల్లాల్లోని 50 వేల‌కు పైగా గ్రామాల‌లో ఆస్తి యజమానులుగా దేశంలోని గ్రామాల‌కు, గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఈ రోజు చాలా చారిత్ర‌క‌మైన రోజు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు . స్వామిత్వ యోజన కింద 65 లక్షల ప్రాపర్టీ కార్డులు పంపిణీ.

స్వామిత్వ పథకం అంటే ఏమిటి

అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా సర్వే చేసేందుకు స్వామిత్వ పథకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కలిగి ఉన్న కుటుంబాలకు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ అందించడం ద్వారా గ్రామీణ భారత ఆర్థిక ప్రగతిని పెంపొందించే లక్ష్యంతో పనులు జరిగాయి. SVAMITVA (గ్రామాల సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్) గ్రామీణ భారతదేశాన్ని మార్చడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది.

దీని కింద ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన యాజమాన్య రికార్డులతో ఖచ్చితమైన ఆస్తి యాజమాన్య డేటాను అందిస్తోంది. తద్వారా భూ వివాదాలు తగ్గుతాయి.

పథకం వల్ల ప్రయోజనం ఏమిటి?

  • ఈ పథకం ఆస్తుల మోనటైజేషన్‌ను సులభతరం చేయడంలో కూడా సహాయపడుతుంది.
  • ఈ కార్డు ద్వారా గ్రామ ప్రజలు బ్యాంకు రుణం పొందవచ్చు.
  • ఈ పథకం ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గించింది.
  • స్వామిత్వ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, ఆస్తిపన్ను మెరుగైన మదింపును సులభతరం చేస్తుంది.

ఇప్పటి వరకు 2 కోట్ల 25 లక్షల ప్రాపర్టీ కార్డులు సిద్ధం:

3 లక్షల 17 వేలకు పైగా గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఈ లెక్కన గ్రామాలలో 92 శాతం వర్తిస్తుంది. ఇప్పటి వరకు లక్షా 53 వేలకు పైగా గ్రామాలకు సంబంధించి దాదాపు 2 కోట్ల 25 లక్షల ఆస్తి కార్డులు సిద్ధం చేశారు.

పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, హర్యానాలలో ఈ పథకం పూర్తిగా అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, అనేక కేంద్ర పాలిత ప్రాంతాలలో డ్రోన్ సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ పథకాన్ని 24 ఏప్రిల్ 2020 (జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం) నాడు ప్రధాని మోదీ ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో భూ రికార్డులను డిజిటల్‌ పద్ధతిలో తయారు చేస్తారు. స్వామిత్వ పథకం స్కీమ్‌ అనేది పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ చొరవ. దీని లక్ష్యం డ్రోన్లు, జీఐఎస్‌ సాంకేతికతను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లోని భూ యజమానులకు హక్కుల రికార్డును అందించడం. దీంతో వారు తమ ఆస్తులను రుణం తీసుకోవడం వంటి ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో భూ సంబంధిత వివాదాలను తగ్గించడానికి, గ్రామీణ ఆర్థిక పురోగతి కోసం యాజమాన్య పథకం ప్రారంభించారు.

 


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి