SCR: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఈ ట్రైన్స్ బయల్దేరే సమయాల్లో మార్పులు..

తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. ఈ రోజు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, సిర్పూర్ కాగజ్‌నగర్ - బీదర్ ఎక్స్‌ప్రెస్ సమస్యాల్లో మార్పులు చేసినట్టు పేర్కొంది. కాబట్టి పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి..

SCR: రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. ఈ ట్రైన్స్ బయల్దేరే సమయాల్లో మార్పులు..
Vande Bharat , Bidar Express Timings Changed Today

Updated on: Sep 13, 2026 | 12:32 PM

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, కర్ణాటకలోని బీదర్ మధ్య రాకపోకలు సాగించే ట్రైన్ సర్వీసు సమాయాల్లో స్వల్ప మార్పులు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. జతగా నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా పలు రైళ్ల వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు ఆయా రైళ్లను రీషెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

రీషెడ్యూల్ చేసిన రైళ్ల వివరాలు

సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే 20834 నెంబర్ గల వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు మధ్యాహ్నం 15:00 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరాల్సి ఉండగా.. దాని జతగా నడిచే ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నందున.. ఈ ట్రైన్ అదే రోజు సాయంత్రం 16:35( 04:35) గంటలకు రీషెడ్యూల్ చేసినట్టు రైల్వే శాఖ పేర్కొంది.

సిర్పూర్ కాగజ్‌నగర్ – బీదర్ ఎక్స్‌ప్రెస్: అలాగే సిర్పూర్ కాగజ్‌నగర్ – బీదర్ మధ్య రాకపోకలు సాగించే 17012 నెంబర్ గల రైలు.. ఈ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుండి బయలుదేరాల్సి ఉండగా, దీనికి సంబంధించిన జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా.. ఈ ట్రైన్‌ను సాయంత్రం 17:20(05:20) గంటలకు రీషెడ్యూల్ చేసినట్టు తెలిపింది.

ప్రయాణికులకు విజ్ఞప్తి

కాబట్టి ఈ రూట్‌లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు రైళ్ల రాకపోకల్లో జరిగిన ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని కోరింది. ఇందుకు అందరూ ప్రయాణికులు సహకరించాలని రైల్వే శాఖ కోరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us