Silver Price Today: మనదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ వ్యాపారం తగ్గినా.. గోల్డ్, సిల్వర్ వ్యాపారం మాత్రం జోరుగా కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా బంగారం ధర పెరిగితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలను అధికంగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. ఇక తాజాగా శనివారం (నవంబర్ 27)న దేశంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 63,100 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 63,100 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్కతాలో రూ.63,100 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, విజయవాడలో రూ.67,900 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, మధురైలో రూ.67,900 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్సైట్ల ఆధారంగా వెండి ధరలు ఇవ్వబడ్డాయి. ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం మంచిది.
ఇవి కూడా చదవండి: