
డిజిటల్ చెల్లింపులు దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ లావాదేవీలను వేగవంతం, సులభతరం చేశాయి. వాడకం పెరిగే కొద్దీ, డిజిటల్ చెల్లింపుల భద్రత పట్ల వినియోగదారులలో అవగాహన పెరగాలి. సురక్షితమైన చెల్లింపు విధానాలను పాటించడం సులభమే, ఇవి దీర్ఘకాలంలో మీకు డిజిటల్ అనుభూతిని భద్రంగా ఉంచుతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా జరపడానికి 5 చిట్కాలను సూచిస్తోంది.
ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు స్క్రీన్పైన కనిపించే పేరును తప్పకుండా తనిఖీ చేయండి. మీరు ఎవరికి డబ్బు పంపిస్తున్నారో, ఆ పేరే స్క్రీన్ మీద ఉందో లేదో నిర్ధారించుకోండి. చెల్లింపును నిర్ధారించడానికి కొన్ని సెకన్ల సమయం తీసుకోండి. తొందరపడి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి.
ఎప్పుడూ అధికారికమైన, పేరున్న యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే చెల్లింపులు జరపండి. మీకు తెలియని వారు, నమ్మకం లేని వారు పంపే లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. అటువంటి లింకులను క్లిక్ చేయకండి.
మీ యూపీఐ పిన్, ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్), లేదా బ్యాంక్ వివరాలు అత్యంత వ్యక్తిగతమైనవి, గోప్యమైనవి. మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం, లేదా పోలీసులం, లేదంటే ప్రభుత్వ కార్యాలయానికి చెందినవారం అని ఎవరైనా చెప్పినా సరే, ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
వెంటనే పేమెంట్ చేయాలని లేదా మీ వివరాలను అత్యవసరంగా ఇవ్వాలని ఎవరైనా మిమ్మల్ని తొందరపెడితే, కంగారుపడకండి. కాస్త సమయం తీసుకోండి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. అవసరమైతే, వారికి తిరిగి కాల్ చేస్తానని చెప్పండి. మీకు కావాల్సినంత సమయం తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
మీరు చేసే చెల్లింపులకు సంబంధించిన ఎస్ఎంఎస్, యాప్ నోటిఫికేషన్లను ఎప్పుడూ ఆన్ చేసి ఉంచండి. ప్రతి అలర్ట్ను జాగ్రత్తగా చదవండి. ఏదైనా తేడాగా అనిపిస్తే, వెంటనే మీ బ్యాంక్ లేదా పేమెంట్ యాప్ను సంప్రదించండి.
ఈ అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా మీరు మీ డిజిటల్ భద్రతను సొంతంగా చూసుకోగలరు. అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగం పెరిగే కొద్దీ రోజువారీ డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా మారుతాయి. అనుమానాస్పద నంబర్లు కనిపించినప్పుడు వెంటనే నేషనల్ సైబర్క్రైమ్ హెల్ప్లైన్ 1930కి డయల్ చేయండి లేదా టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (https://sancharsaathi.gov.in/sfc/) ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేయాల్సి వస్తే, దర్యాప్తుకు సహాయపడటానికి మెసేజ్లను సేవ్ చేసుకోండి, స్క్రీన్షాట్లు తీసుకోండి, సంభాషణలను నమోదు చేయండి.
ఇండియా – నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) భారత విద్యుత్ డెరివేటివ్స్ మార్కెట్ అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. విజయవంతంగా నెలవారీ విద్యుత్ ఫ్యూచర్స్ (ELECMBL) కాంట్రాక్టులను ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ సోమవారం ప్రకటించింది.