
మీరు ఇప్పుడు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఇప్పుడు గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే పండగ సీజన్లో కార్లపై వివిధ ఆఫర్లను అందిస్తుంటాయి బ్యాంకులు. అందుకే ఈ పండగ సీజన్లో కొత్త కారు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం పండుగ సీజన్ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఎస్బీఐ ఈ ఆఫర్ కింద కార్ లోన్ తీసుకునే తన కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం లేదు. అంటే మీరు కొన్ని వేల రూపాయలు ఆదా చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఆఫర్ను పొందడానికి మీకు చాలా నెలల సమయం ఉంది.
వాస్తవానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆటో లోన్పై ఒక సంవత్సరం మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటు (MCLR)ని వర్తిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 8.55 శాతం. ఎస్బీఐ ఎవరికైనా రుణం ఇస్తే కనీసం 8.55% వడ్డీని వసూలు చేస్తుంది. స్టేట్ బ్యాంక్ అటువంటి కారు రుణాలను 8.80 శాతం నుంచి 9.70 శాతం వడ్డీ రేట్ల వద్ద ఇస్తుంది. క్రెడిట్, సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు.
ప్రత్యేక విషయం ఏమిటంటే, బ్యాంకు నుండి రుణాన్ని ఆమోదించే సమయంలో వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. రుణం గడువు ముగిసే వరకు వడ్డీ రేటు వర్తిస్తుంది. అయితే, కారు రుణం కాలవ్యవధి 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. ఈ ఆఫర్ 31 జనవరి 2024 వరకు అందుబాటులో ఉంటుంది. మీరు ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మీరు కింద పేర్కొన్న కొన్ని ముఖ్యమైన పత్రాలను బ్యాంక్కి సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి