లోన్ కావాలా.. అయితే స్మార్ట్ ఫోన్ కొనండి..

| Edited By:

Sep 27, 2019 | 1:18 PM

స్మార్ట్ ఫోన్‌లలో నెంబర్ వన్ అయిన శాంసంగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఆ సంస్థ. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి లోన్ అందిస్తామని.. శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ దీప్ తెలిపారు. చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్ సెట్స్ తయారీ కంపెనీల్లో షావోమి ఒకటి. ఈ కంపెనీ ప్రారంభించిన అనతి కాలంలోనే నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌కి చేరింది. శాంసంగ్‌ జోరుకు బ్రేక్ వేసింది. అందుబాటు ధరలోనే […]

లోన్ కావాలా.. అయితే స్మార్ట్ ఫోన్ కొనండి..
Follow us on

స్మార్ట్ ఫోన్‌లలో నెంబర్ వన్ అయిన శాంసంగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఆ సంస్థ. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి లోన్ అందిస్తామని.. శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ దీప్ తెలిపారు. చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్ సెట్స్ తయారీ కంపెనీల్లో షావోమి ఒకటి. ఈ కంపెనీ ప్రారంభించిన అనతి కాలంలోనే నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌కి చేరింది. శాంసంగ్‌ జోరుకు బ్రేక్ వేసింది. అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో కంపెనీ ఫోన్లను విక్రయించడం బాగా కలిసొచ్చింది. ఎప్పటి కప్పుడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడంతో బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమి, శాంసంగ్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

షావోమి తన కస్టమర్లకు లోన్ అందిస్తామని ప్రకటించింది. తాజాగా శాంసంగ్ కూడా షావోమి బాటలోనే నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి లోన్ అందిస్తామని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. భారత్‌లో ఫోన్ అమ్మకాలు పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోన్ సేవలు అందించేందుకు శాంసంగ్ దేశీయంగా డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో జతకట్టనుంది. దీంతో అర్హత కలిగిన వారికి ఫోన్ కొనేందుకు కంపెనీయే లోన్ అందిస్తుంది. కాగా, దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 5000 స్టోర్లలో తొలిగా ఈ సేవలు ఆవిష్కరిస్తున్నామని సింగ్ తెలిపారు. తరువాతి ఏడాది కల్లా 10,000 స్టోర్లలో లోన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు.