
Plastic Roads: ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచానికి ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, ఈ వ్యర్థ సమస్యకు పరిష్కారంగా చైనా ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టింది. రీసైక్లింగ్ చేయడానికి అత్యంత కష్టతరమైన ప్లాస్టిక్ పాల బాటిళ్లను ఉపయోగించి రోడ్డును నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వినూత్న ప్రాజెక్ట్ను చైనాలోని ఈస్ట్ చైనా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ECUST) ప్రాంగణంలో “డౌ” (Dow) అనే రసాయన సంస్థ , “షైనీ మీడో” (Shiny Meadow) అనే డెయిరీ బ్రాండ్ సంయుక్తంగా నిర్వహించాయి.
ఇది కూడా చదవండి: Indian Railways: లోయర్ బెర్త్ కావాలంటే ఇలా బుక్ చేయండి.. రైల్వేలో ఈ రహస్యం చాలామందికి తెలియదు!
సాధారణంగా ఉపయోగించిన పాల బాటిళ్లను రీసైక్లింగ్ పరిశ్రమలు తీసుకోవడానికి ఇష్టపడవు. వాటిలో మిగిలిపోయిన పాల శేషాల వల్ల దుర్గంధం, గందరగోళం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. సాంకేతికంగా ఇవి రీసైక్లింగ్ చేయదగినవే అయినప్పటికీ, ఈ కారణం చేత వీటిని సాధారణ చెత్తగానే భావించి పారవేస్తుంటారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ‘డౌ’ సంస్థ ఒక ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించింది. ముందుగా సేకరించిన 6,000 కంటే ఎక్కువ ప్లాస్టిక్ పాల బాటిళ్లను శుభ్రపరిచి ‘పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్డ్’ ప్లాస్టిక్గా మార్చారు. ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ను తారు (Asphalt) మిశ్రమంలో కలిపి రహదారి నిర్మాణానికి ఉపయోగించారు.
తారులో ప్లాస్టిక్ కలపడం వల్ల రోడ్ల మన్నిక పెరుగుతుంది. సాంప్రదాయ తారు వినియోగాన్ని తగ్గించడం వల్ల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలు, శక్తి వినియోగం తగ్గుతాయి. వ్యర్థాలుగా పారవేసే ప్లాస్టిక్ను శాశ్వతమైన అవస్థాపన వనరుగా మార్చవచ్చు.
ఈ ప్రయోగం కేవలం చైనాకే పరిమితం కాలేదు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్తో రహదారుల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు డౌ సంస్థ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో కూడా పనిచేస్తోంది. భారత్లోని పుణే, బెంగళూరు వంటి నగరాల్లో కూడా భాగస్వామ్య సంస్థలతో కలిసి ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Business Ideas: ఇంట్లోనే బిజినెస్.. రూ.1,000 పెట్టుబడితో మొదలుపెట్టి లక్షల్లో సంపాదించే ఛాన్స్!
ఇది కూడా చదవండి: Smartwatch: స్మార్ట్వాచ్ వెనుక ఈ గ్రీన్ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? 99% మందికి తెలియని అసలు రహస్యం ఇదిగో!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి