Property Rules: ఈ ఒక్క తప్పు చేస్తే మీ తండ్రి ఆస్తిలో ఒక్క పైసా కూడా మీకు రాదు!

Property Rules: కొన్ని సందర్భాల్లో ఒక తండ్రి తన వీలునామాలో తన ఆస్తి మొత్తాన్ని పేర్కొనకపోవచ్చు. ఉదాహరణకు, అతను ఒక వ్యక్తికి మాత్రమే ఇల్లు వదిలివేసి, తనకున్న భూమి గురించి వీలునామా రాయకపోతే వీలునామాలో లేని ఆస్తి చట్టబద్ధంగా పిల్లలందరికీ సమానంగా..

Property Rules: ఈ ఒక్క తప్పు చేస్తే మీ తండ్రి ఆస్తిలో ఒక్క పైసా కూడా మీకు రాదు!
Property Rules

Updated on: Jan 31, 2026 | 7:17 AM

Property Rules: జీవితకాలంలో తల్లిదండ్రులకు చాలా దగ్గరగా ఉన్న తోబుట్టువులు, వారి మరణం తర్వాత ఆస్తి కోసం కోర్టుకు వెళ్లడం మనం చూస్తుంటాము. అలాంటి గొడవలను తగ్గించడానికి, చాలా మంది తల్లిదండ్రులు చనిపోయే ముందు వీలునామా రాస్తారు. అయితే ఆ వీలునామా రిజిస్టర్ కాకపోతే కోర్టుకు వెళ్లినప్పుడు చెల్లుబాటు అవుతుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని గురించి ఇప్పుడు ఒక నిజమైన సంఘటన ఆధారంగా తెలుసుకుందాం!

ఒక కుటుంబంలో ఒక తండ్రి 2022లో మరణించాడు. అతనికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. అతని మరణానికి ముందు తండ్రి తన ఆస్తిని తన పిల్లలకు అప్పగించాలని వీలునామా రాశాడు. కానీ ఆ వీలునామా నమోదు కాలేదు. దీని కారణంగా అతని మరణం తర్వాత అతని తోబుట్టువులు కొందరు కోర్టును ఆశ్రయించారు. 2005 చట్టం ప్రకారం ఆస్తిలో తమకు కూడా సమాన వాటా కావాలని వారు వాదించారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి వివాదం తీవ్రమైంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

అలాంటి సమయంలో తండ్రికి ఈ ఆస్తి ఎలా వచ్చిందో గమనించాలి? హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తిని వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తారు. ఆ ఆస్తి పూర్వీకుల ఆస్తిగా మారదు. ఇది ఉమ్మడి కుటుంబ ఆస్తిగా కూడా పరిగణించరు. అందుకే తండ్రికి వీలునామా ద్వారా తనకు నచ్చిన వారికి ఆస్తిని కేటాయించే హక్కు ఉంది. అదే ఆస్తి అతని తండ్రి, తాతామామల నుండి తండ్రికి వస్తే వారసులందరికీ హక్కు ఉంటుంది.

ఇక్కడ చాలా మందికి వచ్చే ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. వీలునామా నమోదు చేయాలా? లేదా?. న్యాయ నిపుణులు చెప్పేది ఏమిటంటే.. భారత వారసత్వ చట్టం ప్రకారం, వీలునామా నమోదుకు ఎటువంటి నిబంధన లేదు. అంటే నమోదు చేయని వీలునామా కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. అది నకిలీదని లేదా బలవంతంగా రాసినదని నిరూపించలేకపోతే అది కోర్టులో చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు ఇప్పటికీ తమ ఆస్తిని వీలునామా రూపంలో తమ వారసులకు ఇస్తారు. కొందరు ఆ వీలునామాను రిజిస్టర్ ఆఫీసులో తమ పేరు మీద నమోదు చేసుకుంటారు.

ఇది కూడా చదవండి: Best Bikes: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 5 బైక్‌లు ఇవే.. తక్కువ ధర, బెస్ట్‌ మైలేజీ!

ఇక్కడ కొంతమందికి వచ్చే మరో ప్రశ్న ఉంది. 2005 సవరణ చట్టం ప్రకారం, కుమార్తెలతో పాటు కొడుకులకు కూడా ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయి. అయితే ఒక తండ్రి తన వ్యక్తిగత ఆస్తిపై వీలునామా రాసిన సందర్భంలో ఆస్తి అతను పేర్కొన్న వారికి వెళుతుంది. తండ్రి వీలునామా లేకుండా మరణిస్తే, కుమారులు, కుమార్తెలందరికీ సమాన వాటా లభిస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఒక తండ్రి తన వీలునామాలో తన ఆస్తి మొత్తాన్ని పేర్కొనకపోవచ్చు. ఉదాహరణకు, అతను ఒక వ్యక్తికి మాత్రమే ఇల్లు వదిలివేసి, తనకున్న భూమి గురించి వీలునామా రాయకపోతే వీలునామాలో లేని ఆస్తి చట్టబద్ధంగా పిల్లలందరికీ సమానంగా వెళుతుంది. అప్పుడు కుమారులు, కుమార్తెలందరికీ ఆస్తిలో వాటా లభిస్తుంది. అయితే, మిగిలిన పిల్లలకు వీలునామాలో రాసిన దానిపై ఎటువంటి హక్కు ఉండదు.

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రిజిస్టర్ కాని వీలునామా కూడా చట్టబద్ధమే. అయితే, భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి, వీలునామాను స్పష్టంగా రాసి, అవసరమైతే నమోదు చేసుకోవడం మంచిదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొడుకులు, కూతుళ్ల మధ్య ఆస్తి వివాదాలు ఉండవు.

Indian Railways: సూపర్‌ ఫాస్ట్‌ నుంచి ప్యాసింజర్‌ వరకు 12 రైళ్ల సమయాల్లో మార్పు.. ఎప్పటి నుంచి అంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us