Petrol Price: రూ. 370కి చేరిన పెట్రోల్ ధర.. లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన ఆ ప్రభుత్వం!

Petrol Price: ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ఒక అవగాహన ప్రచారం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ పథకం కింద మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చిన్న కార్లను రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తు్న్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల..

Petrol Price: రూ. 370కి చేరిన పెట్రోల్ ధర.. లీటరుకు రూ.100 సబ్సిడీ ప్రకటించిన ఆ ప్రభుత్వం!
Petrol Price

Updated on: Sep 16, 2026 | 10:04 AM

Petrol Price: పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చే ప్రకటన చేశారు. పెట్రోల్ కొనుగోలుపై ప్రజలకు లీటరుకు రూ.100 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. దీని కింద కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లో పెట్రోల్ ధరలు ఇప్పటికే లీటరుకు రూ.370కి చేరుకున్న విషయం తెలిసిందే.

మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చిన్న కార్లు ఉన్నవారికి మాత్రమే ప్రయోజనం:

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మోటార్ సైకిళ్లు, రిక్షాలు, చిన్న కార్లు నడిపే ప్రజల కోసం పెద్ద రిలీఫ్‌ ఇచ్చే స్కీమ్‌ను ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఒక లీటర్ పెట్రోల్‌పై 100 రూపాయల సబ్సిడీ:

ధానమంత్రి కార్యాలయం జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఈ కష్ట సమయంలో తాము ప్రజలను అందుకుంటామని షరీఫ్ అన్నారు. ఈ పథకం కింద ద్విచక్ర, త్రిచక్ర వాహన డ్రైవర్లకు ప్రతి నెలా కొనుగోలు చేసే గరిష్టంగా 20 లీటర్ల పెట్రోల్‌పై లీటరుకు 100 పాకిస్తానీ రూపాయల సబ్సిడీ అందిస్తారు. 800 సిసి వరకు ఉన్న చిన్న కార్ల యజమానులు ప్రతి నెలా గరిష్టంగా 30 లీటర్ల పెట్రోల్‌పై లీటరుకు 100 పాకిస్తానీ రూపాయల సబ్సిడీని పొందుతారు. ఈ సబ్సిడీ తర్వాత ప్రజలు లీటరు పెట్రోల్‌కు సుమారు 270 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది:

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు 370 పాకిస్తానీ రూపాయలకు పైగా ఉండి, నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ పథకాన్ని ప్రారంభిస్తూ పెట్రోలియం ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై పడుతున్న భారం గురించి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని షాబాజ్ షరీఫ్ అన్నారు. ఈ పథకం సోమవారం, మంగళవారాల మధ్య రాత్రి నుండి ఇస్లామాబాద్‌లో అమలు కాగా, బుధవారం, గురువారాల మధ్య రాత్రి నుండి పాకిస్తాన్ అంతటా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.,

ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ఒక అవగాహన ప్రచారం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ పథకం కింద మోటార్‌సైకిళ్లు, రిక్షాలు, చిన్న కార్లను రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తు్న్నారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేశారు.

 

ఇది కూడా చదవండి: Driving License: వాహనదారులకు హెచ్చరిక.. సెప్టెంబర్ 25లోగా ఈ పనిచేయకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక రైల్ వన్ యాప్‌లో ఆ టికెట్స్‌ కూడా..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం

Loading...
Unable to load recommendations.
Follow Us