Electric Bike: మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కి.మీ

Electric Bike: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లు..

Electric Bike: మార్కెట్లోకి అదిరిపోయే ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కి.మీ

Updated on: Feb 06, 2022 | 10:24 AM

Electric Bike: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్న దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లు అందుబాటులోకి రాగా, మరికొన్ని మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఇక బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ స్టార్ట్ అప్‌ ఓబెన్‌ ఈవీ తన మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌ను మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మొదటి ఎలక్ట్రిక్‌ బైక్‌కు ‘ఓబెన్‌ రోర్‌’ అనే పేరు పెట్టింది. ఈ బైక్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే కస్టమర్లకు ఈ బైక్‌ 2022 రెండో త్రైమాసికంలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం. ఈ బైక్‌ గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. ఈ బైక్‌ 3 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వ్యవస్థాపకుడు దింకర్‌ తెలిపారు.

రెండు గంటల్లోన ఫుల్‌ ఛార్జింగ్‌:

ఈ బైక్‌ కేవలం రెండు గంటల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ కానుంది. ఈ బైక్‌ ధర ఎంత అనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పల్సర్‌ 180CC, 200CC బైక్‌లతో సమానంగా రైడింగ్‌ అనుభావాన్ని అందిస్తుందని దింకర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇక కంపెనీ చుట్టూ తిరగకుండా ఆ పని మీరే చేసుకోవచ్చు

Banking News: ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు విడుదల.. నికర లాభం రెండింతలు..!

Follow Us