New UPI Transaction Rule: యూపీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. లావాదేవీ విఫలమైతే ఇప్పుడు మీకు తక్షణమే రీఫండ్‌!

New UPI Transaction Rule: యూపీఐ లావాదేవీల కేసును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కొత్త ఆటోమేటెడ్ ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతం చేస్తుంది. త్వరగా డబ్బులు రీఫండ్ అందే అవకాశం ఉంటుంది..

New UPI Transaction Rule: యూపీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. లావాదేవీ విఫలమైతే ఇప్పుడు మీకు తక్షణమే రీఫండ్‌!

Updated on: Feb 17, 2025 | 2:59 PM

పెద్ద మాల్స్ నుండి కూరగాయల దుకాణాల వరకు నేడు ప్రజలు UPI ద్వారా ప్రతిచోటా చెల్లింపులు చేస్తున్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం భారతదేశంలో ప్రజల జీవితాల్లో ఒక భాగంగా మారింది. అదే సమయంలో ఇప్పుడు యూపీఐ చెల్లింపు గురించి ఒక వార్త వచ్చింది. లావాదేవీ విఫలమైతే లేదా యూపీఐలో డబ్బు నిలిచిపోయినట్లయితే రీఫండ్‌ రావడానికి కొన్ని రోజుల సమయం పట్టేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందేమి లేదు. యూపీఐ లావాదేవీ విఫలమైతే ఎక్కువ సమయం పట్టదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇప్పుడు ఛార్జ్‌బ్యాక్ అభ్యర్థనల కోసం ఆమోదం, తిరస్కరణ ప్రక్రియను ఆటోమేట్ చేసింది.

ఏదైనా యూపీఐలో లావాదేవీ విఫలమైతే లేదా డబ్బు నిలిచిపోయినట్లయితే, మీరు రీఫండ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మీ UPI లావాదేవీ విఫలమైతే, మీకు రీఫండ్ అందకపోతే, మీరు మునుపటిలాగా మీ బ్యాంక్ నుండి ఛార్జ్‌బ్యాక్‌ను అభ్యర్థించే ప్రక్రియలో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ ఆటోమేటెడ్ చేసింది. ఇది రీఫండ్ ప్రక్రియను గతంలో కంటే వేగవంతం చేస్తుంది. డబ్బు వీలైనంత త్వరగా మీ ఖాతాకు తిరిగి వస్తుంది.

యూపీఐ లావాదేవీల కేసును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కొత్త ఆటోమేటెడ్ ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త వ్యవస్థ ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతం చేస్తుంది. త్వరగా డబ్బులు రీఫండ్ అందే అవకాశం ఉంటుంది.

ఛార్జ్‌బ్యాక్ ఎందుకు జరుగుతుంది?

సాంకేతిక సమస్య, మోసం లేదా డెలివరీ కానప్పుడు సాధారణంగా ఛార్జ్‌బ్యాక్‌లు జరుగుతాయి. ఉదాహరణకు, ఇంటర్నెట్ సమస్యలు, ఒకే లావాదేవీని పదే పదే తగ్గించడం లేదా మోసం వల్ల వాపసు వస్తుంది.

ఛార్జ్‌బ్యాక్, రీఫండ్ మధ్య వ్యత్యాసం: ఛార్జ్‌బ్యాక్, రీఫండ్ రెండూ చెల్లింపును తిరిగి ఇస్తాయి. కానీ వాటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది.

వాపసు: కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ వాపసు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఛార్జ్‌బ్యాక్: లావాదేవీని పరిశీలించి, వాపసు అందించడానికి కస్టమర్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి.

కొత్త నియమాలు ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియను వేగవంతం, పారదర్శకంగా చేస్తాయి. తద్వారా వినియోగదారులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి