అమెజాన్ ప్రైమ్ డే సేల్ అంటే వినియోగదారులకు పండగే. అతి తక్కువ ధరలకు అనేక వస్తువులను సొంతం చేసుకునే ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్ లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమెజాన్ భారీ తగ్గింపు ధరలకే విక్రయిస్తోంది. జూలై 20, 21 తేదీలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరుగుతోంది. అయితే ఈ సేల్ లో కొన్ని వస్తువులపై కేవలం ఒక్క రూపాయి డిస్కౌంట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 20 ప్రారంభమై రెండు రోజులు జరుగుతుంది. దీనిలో ప్రైమ్ మెంబర్లకు వివిధ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నారు. అనేక టాప్ బ్రాండ్లపై ఎపిక్ డీల్స్ అందిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. వివిధ రకాల వస్తువులపై 65 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
అమెజన్ సేల్ లో కొన్ని వస్తువులపై అత్యంత తక్కువ తగ్గింపు ఇస్తున్నట్టు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే డిస్కౌంట్ లభించిందని చెబుతూ ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నారు. వీటిని చూపుతూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
అమెజాన్ డిస్కౌంట్లు ఆటోమేటెడ్ సిస్టమ్స్, స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉపయోగించి నిర్ణయిస్తారు.
ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, మరికొన్నింటిపై అమెజాన్ 65 శాతం వరకూ తగ్గింపులు అందిస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో భాగస్వామ్యం చేయబడిన పోస్టులు చాలా అసాధారణమైనవి చెప్పవచ్చు.
అమెజన్ ప్రైమ్ డే సేల్ లో అనేక వస్తువులు అత్యంత తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులపై దాదాపు 65 శాతం డిస్కౌంట్ తో పాటు బ్యాంకు కార్డు ఆఫర్లు, ఎక్స్చేంచ్ అవకాశం కూడా ఉంది. కొన్ని ఉత్పత్తులపై కొంబో డీల్ కూడా అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..