Today Silver Price: ఒక వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుంటే.. మరో వైపు వెండి ధరలు పెరుగుతున్నాయి. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి రూ.1300 మేర పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 67,900 ఉండగా, ముంబైలో కిలో వెండి రూ.67,900 ఉంది. చెన్నైలో రూ.72,800 ఉండగా, బెంగళూరులో రూ.67,900వద్ద కొనసాగుతోంది. ఇక కోల్కతాలో కిలో వెండి ధర రూ.67,900 వద్ద కొనసాగుంది. ఇక హైదరాబాద్లో వెండి కిలో రూ.72,800 ఉండగా, విజయవాడలో రూ.72,800 ఉంది.
కాగా, దేశంలోని బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నారు విశ్లేషకులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న బంగారం ధరలు.. 7 నెలల్లో రూ.13,200 తగ్గింపు