అతి తక్కువ కరెంట్‌ బిల్‌ వచ్చే ACలు వచ్చేస్తున్నాయ్‌! కేంద్ర ప్రభుత్వం అద్భుత నిర్ణయంతో..

భారత ప్రభుత్వం ఏసీల ఉష్ణోగ్రతను 20°C నుండి 28°C కి పరిమితం చేసే నిబంధనలను పరిశీలిస్తోంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం అనేక ఏసీలు 16°C వరకు ఉష్ణోగ్రతను తగ్గించే అవకాశాన్ని కల్గి ఉంటాయి. ఈ కొత్త నిబంధనలు శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, పర్యావరణాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

అతి తక్కువ కరెంట్‌ బిల్‌ వచ్చే ACలు వచ్చేస్తున్నాయ్‌! కేంద్ర ప్రభుత్వం అద్భుత నిర్ణయంతో..
Ac And Pm Modi

Updated on: Jun 11, 2025 | 6:47 PM

కాలంతో సంబంధం లేకుండా చాలా మంది ఏసీ వాడుతుంటారు. మధ్యతరగతి వాళ్లు కేవలం వేసవి కాలంలోనే ఏసీ వాడుతుంటారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఏసీలు విపరీతంగా పెరగడంతో విద్యుత్‌ వాడకం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది, మరోవైపు పర్యావరణానికి హాని కూడా కలుగుతోంది. ఈ రెండు సమస్యలను కాస్త తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ఆలోచన చేసింది. అదేంటంటే.. ఏసీల ఉష్ణోగ్రత ప్రామాణీకరణను పరిశీలిస్తోంది. దీని కోసం, కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమాలను రూపొందించే అవకాశం ఉంది.

ఆ తర్వాత అన్ని కంపెనీల అన్ని రకాల ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రత పరిధి 20°C నుండి 28°C మధ్య ఉంటుంది. ఇలా చేయడం వల్ల విద్యుత్ బిల్లులను తగ్గించడంలో, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో, శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం చాలా రకాల ఏసీల్లో 16 పాయింట్ల నుంచి 28 పాయింట్ల వరకు ఏసీని తగ్గించవచ్చు పెంచవచ్చు. 16 పాయింట్లపై ఏసీ నడిపిస్తే ఎక్కువ చల్లగా ఉంటుంది. అలాగే విద్యుత్‌ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏసీ పాయింట్లను 20 నుంచి 28 మధ్య ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, శీతలీకరణ వ్యవస్థల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియా మొదటిసారిగా అన్ని రంగాలకు ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రతను కనీసం 20 డిగ్రీల సెల్సియస్, 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా ఉంచాలని తప్పనిసరి చేయబోతోందని కేంద్ర ఇంధన మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం అన్నారు. శీతలీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, విద్యుత్ డిమాండ్‌లో హెచ్చుతగ్గులను తగ్గించడం, విద్యుత్ బిల్లులను తగ్గించడం ఈ చర్య లక్ష్యం అని ఖట్టర్ అన్నారు. ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను అంగీకరిస్తూ ప్రభుత్వం నియమాలు రూపొందిస్తే ఎయిర్ కండిషనర్ల ఉష్ణోగ్రత పరిధి తగ్గుతుంది. ప్రస్తుతం వివిధ కంపెనీల వివిధ AC మోడల్‌లు 16°C నుండి 30°C వరకు ఉష్ణోగ్రత పరిధిని కలిగి ఉన్నాయి. కానీ, ప్రతిపాదిత నియమాల ప్రకారం, ఈ పరిధిని 20°C నుండి 28°C వరకు పరిమితం చేయవచ్చు.

ఏసీని ఎంత ఉష్ణోగ్రత వద్ద నడపాలి?

2020లో BEE అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సిఫార్సు ప్రకారం.. ACలకు డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌గా సెట్ చేయాలి. ఇది అన్ని బ్రాండ్‌లు, స్టార్-లేబుల్ చేయబడిన ACలకు వర్తిస్తుంది. BEE ఈ సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ఇంధన మంత్రి ఖట్టర్ కొత్త నియమాలను రూపొందించడాన్ని పరిశీలించడం ప్రారంభించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి