Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..

|

Apr 01, 2022 | 10:38 AM

Market News: నెల ఆరంభంలో భారత్ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు ఫాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెనెక్స్ 50 పాయింట్లు, మరో సూచీ నిఫ్టీ 25 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి.

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..
Market News
Follow us on

Market News: నెల ఆరంభంలో భారత్ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు ఫాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీ సెనెక్స్ 50 పాయింట్లు, మరో సూచీ నిఫ్టీ 25 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 130కి పైగా పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 200 పాయింట్లకు పైగా పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. వారాంతం కావటంతో మార్కెట్లు మందకొడిగా ఉన్నాయి. ఇదే సమయంలో రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు, రష్యాన్ రూబుల్- ఇండియన రూపీ చెల్లింపులు చేసుకుంటున్నతరుణంలో అమెరికా ఆగ్రహంగా ఉండటం మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే ప్రభావం ఉందని మార్కెట్ నిపుణలు అంటున్నారు. గడచిన నెల ప్రారంభం వరకు నెట్ సెల్లర్స్ గా ఉన్న FIIలు క్రమంగా తమ పెట్టుబడులను తిరిగి భారత మార్కెట్లలోకి మళ్లిస్తుండటం మంచి తరుణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆరంభ ట్రేడింగ్ లో నిఫ్టీ సూచీలోని ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 5.32%, ఎన్టీపీసీ 3.19%, పవర్ గ్రిడ్ 2.65%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.24%, బీపీసీఎల్ 2.17%, గెయిల్ 2.02%, జీ ఎంటర్ ప్రైజెస్ 1.53%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.39%, అదానీ పోర్ట్స్ 1.34%, బజాజా ఆటో 1.29% మేర పెరిగి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. హీరో మోటొ కార్ప్ 3.08%, టైటాన్ కంపెనీ 1.15%, ఇన్ఫోసిస్ 0.77%, ఇండస్ టవర్స్ 0.74%, టెక్ మహీంద్రా 0.07%, సిప్లా 0.03%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.03%, సన్ ఫార్మా 0.01% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

Mahindra: నూతన సాంకేతికతలోకి అడుగుపెట్టిన మహీంద్రా గ్రూప్.. ఆనంద్ మహీంద్రా ప్రకటన..

Petrol Diesel Price: దేశ ప్రజలపై క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు..